సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచిన ఈటెల రాజేందర్
ఆర్.బి.ఎం నిర్మల్: నిర్మల్ సభలో హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్ర శివారులోని ఎల్లపెల్లి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. భారత్ మాతా కీ జై.. అంటూ ఆయన తన ప్రసంగం మొదలెట్టారు. ఈ సభకు ఈటల రాజేందర్ కూడా వచ్చారు. రాజేందర్ను అమిత్షా ప్రత్యేకంగా స్టేజీ నుంచే అందరికీ పరిచయం చేశారు. తనకు దూరంగా ఉన్న ఈటల రాజేందర్ను ముందుకు రావాలని అమిత్షా కోరారు. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ను గెలిపించాలని కోరారు. హుజూరాబాద్లో గెలవబోతున్న ఈటెలకు చప్పట్లతో అభినందనలు తెలపాలంటూ అమిత్ షా సభికులను కోరారు. దీంతో సభంతా మార్మోగింది.