కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ మండల కేంద్రంలో 547 మంది లబ్ధిదారులకు రూపాయలు 5 కోట్ల 47 లక్షల 63 వేయిలా 452 ల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా MLA గారుమాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయ ప్రకాష్,అత్తపూర్ కార్పొరేటర్ సంగీత ,తాసిల్దార్ చంద్రశేఖర్ , డివిజన్ ప్రెసిడెంట్ ధర్మ రెడ్డి,మహేష్ ,శ్రవణ్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.