మార్చ్ 28 నుండి రాత్రి కర్ఫ్యూ..

మార్చ్ 28 నుండి రాత్రి కర్ఫ్యూ..

ముంబై: రోజు రోజుకు కరోనా తీవ్రత వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి తగిన జాగ్రత్తలు తీస్కుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 28 నుండి రాత్రి సమయంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి కర్ఫ్యూ కేవలం కరోనాను నియంత్రించేందుకు మాత్రమేనాని అయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయన వెల్లడించారు.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య మరి ఎక్కువగా నమోదుకావడం  కొన్ని రోజుల నుండి ౩౦ వేల కరోనా కేసులు నమోదైనటు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో కొత్తగా 35,952 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 95 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో ఒకే రోజు ఇంత మొత్తంలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి అని వైద్యాధికారులు తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *