పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొన్న పవన్. పులివెందుల
ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారంటూ పవన్ కల్యాణ్పై పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ కౌన్సిలర్లు నాయకులు కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ గోపీనాథ్కు ఫిర్యాదు చేశారు. వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పులివెందుల గడ్డ గురుంచి తప్పుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ గడ్డ గురుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పులివెందుల అంటేనే ప్రేమ అభిమానాలకు పౌరుషానికి పుట్టినిల్లు అని వారు తెలిపారు.
మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు తమ ప్రాంతంపై చేయకూడని పవన్ కల్యాణకు సూచించారు. బీజేపీ టీడీపీ స్క్రిప్ట్ చదివి ప్యాకెజీలకు అమ్ముడుపోయే పవన్ కళ్యాణ్ కు పులివెందుల గురుంచి మాట్లాడే నైతిక అర్హత లేదు అని ఈ సందర్బంగా వారు అన్నారు. తమ ప్రాంతంపై అనుచిన వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.