చుట్టుప్రక్కల వారికీ దుర్వాసన రావడంతో..!

చుట్టుప్రక్కల వారికీ దుర్వాసన రావడంతో..!

ఆర్.బి.ఎం డెస్క్: గుంటూరు జిల్లాలోని తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో రెండు శవాలు లభ్యమయ్యాయి. గత కొద్దీ రోజులుగా ఆ ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు కొంతమేరకు బయాందోళనకు గురైయ్యారు. ఆ స్థానికులకు ఉయించని పరిణామం ఎదురైంది. ఆ ఇంట్లో నుండి వచ్చే దుర్వాసన తీవ్రత ఎక్కువ కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు రెండు శవాలను పరిశీలించారు. ఈమేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు భార్యాభర్తలు అయిఉండొచ్చని పోలీసులు తెలిపారు. వారు ఇద్దరు మృతి చెంది సుమారు వరం అయిఉండొచ్చని పోలీసులు తెలిపారు.

ఈ జంట మరణాల నేపథ్యంలో పోలీసులు స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిది ఆత్మ హత్య అయితే బయట నుండి తాళం ఎవరు వేస్తారు? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వారిద్దని హత్య చేసి ఇంటి బయట తాళం వేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *