రాయచోటికి రైతు బజారు తలమానికం…

రాయచోటికి రైతు బజారు తలమానికం…

ఆర్.బి.ఎం రాయచోటి: వ్యవసాయమే జీవనాధారంగా జీవనం సాగిస్తున్న రాయచోటి ప్రాంత రైతులకు ప్రభుత్వం నిర్మించిన వైస్సార్ రైతు బజారు తలమానికం కానుంది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి ల కృషితో రూ.కోటితో నిర్మించిన వైస్సార్ రైతు బజారులో సోమవారం కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల కిందట నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న రైతు బజారును ఎంపితో కలిసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.
సోమవారం నుండి రైతు బజార్ లో తాజా కూర గాయలు, ఆకు కూరలు సరసమైన ధరలకు లభినంచనున్నాయి.

Leave a Reply

Your email address will not be published.