నవరత్నాలుతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత..

నవరత్నాలుతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత..

అమరావతి: నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్‌పై ఆయన స్పందించారు. చంద్రబాబు సర్కార్‌ చేసిన అప్పులకు మేం వడ్డీ కడుతున్నామని తెలిపారు. మా ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఎక్కడా కేటాయింపులు తగ్గలేదన్నారు.  బడ్జెట్‌ ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు యత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం టీడీపీ అని  విమర్శించారు. ప్రజలకు మంచి బడ్జెట్‌ ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గనకు శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.