రైడింగ్పై ఇదివరకే ఇద్దర్నీ హెచ్చరించాను.. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై నరేష్ సంచలన విషయాలు..
ఆర్.బి.ఎం హైదరాబాద్: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై సీనియర్ నటుడు నరేష్ సంచలన విషయాలు వెల్లడించారు. రోడ్డు ప్రమాదానికి ముందు సాయిధరమ్ తేజ్, తన ఇంటి నుంచే బయలుదేరాడని తెలిపారు. తన కుమారుడు నవీన్, సాయి ఇద్దరూ మంచి స్నేహితులని చెప్పారు. ఇద్దరూ అన్నదమ్ములా కలిసిమెలసి ఉంటారని నరేష్ తెలిపారు. బైక్ రైడింగ్ చేయొద్దని సాయి తేజ్ను చాలా సార్లు హెచ్చరించానని, తాను ఎంత చెప్పినా తన మాటలు పట్టించుకోలేదని నరేష్ వెల్లడించారు.
‘‘సాయి ధరమ్ తేజ్, మా అబ్బాయి కలిసి రైడింగ్ చేస్తారు. రైడింగ్పై ఇదివరకే ఇద్దర్నీ హెచ్చరించాను. సాయి నా బిడ్డలాంటి వాడు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగులకి హాజరవుతాడని ఆ భగవంతుణ్ణి, మా అమ్మను కూడా ప్రార్ధిస్తున్నాను. నాలుగు రోజుల క్రితం కూడా వీరికి కౌన్సిలింగ్ చేద్దామని అనుకున్నాను. పెళ్లి, కెరీర్తో జీవితంలో సెటిల్ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్లు తీసుకోకుండా ఉండటమే మంచింది. సాయిని చూడటానికి ఆసుపత్రికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని వెళ్లలేదు. త్వరలో సాయి ధరమ్ తేజ్ని కలుసుకుంటాను’’ అని నరేష్ తెలిపారు.