సాయి ధరమ్ తేజ్ వాడిన బైక్ వివరాలు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..
ఆర్.బి.ఎం హైదరాబాద్: హీరో సాయి ధరమ్ తేజ్ వాడిన బైక్ మామూలు బైక్ కాదు. ఆయన వాడిన బైక్ వివరాలు చూస్తే.. షాక్ తినేలా ఉన్నాయి. ఆ బైక్ ఫ్యూచర్స్ అన్ని హై రేంజ్ లో ఉన్నాయి. ఈ బైక్ని ప్రధానంగా రేసింగ్లో వాడతారు. ఆ బైక్ మోడల్.. ట్రియంప్ స్పీడ్-1200. అది ఒక ఐకానిక్ బ్రిటీష్ మోటర్ సైకిల్. 1902 నుంచి ఈ కంపెనీ ఇలాంటి బ్రాండ్లను తయారు చేస్తోంది. ప్రపంచంలోనే ప్రఖ్యాంతిగాంచిన మోడల్ బైక్ ఇది. అంతేకాదు…11వందల 60 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ బైక్ అది. బైక్ ఆయిల్ ట్యాంక్ సామర్థ్యం 15.5 లీటర్లుగా ఉంది. ఈ బైక్ ధరలు మార్కెట్లో సుమారు 7 లక్షల నుంచి 21 లక్షల వరకు ఉంటోంది. సహజంగా రేసర్స్ తో పాటు యూత్ ఎక్కువగా ఈ బైక్స్ను వాడుతుంటారు.