సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి రేసింగే కారణమా!రేసింగ్‌లో పాల్గొన్న మరో వ్యక్తి అయన కుమారుడేనా?

saidharam tej

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి రేసింగే కారణమా! రేసింగ్‌లో పాల్గొన్న మరో వ్యక్తి అయన కుమారుడేనా?

ఆర్.బి.ఎం హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణం అని కొందరంటే.. కాదుకాదు.. రోడ్డుపై ఉన్న ఇసుక వల్ల  స్కిడ్ అయిందని మరికొందరు అంటున్నారు. అయితే సమయం గడుస్తున్న కొద్ది ఈ ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన ఓ సీనియర్ నటుడి కుమారుడితో ధరమ్ తేజ్ బైక్ రేసిండ్ పెట్టుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ పోటీ పెట్టుకోవడంతోనే ధరమ్‌ తేజ్ అతివేగంగా వెళ్తూ ప్రమాదానిక గురయినట్లు తెలుస్తోంది. సీసీటీవీ పుటేజీలో రెండు ద్విచక్రవాహనాలు వేగంగా వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాయిపై రాయదుర్గం పోలీసులు ఐపీసీ 336, మోటర్ వెహికల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు నమోదు చేశారు. ఇక ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బైక్ రైసింగ్ వ్యవహారంపై మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published.