టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. కొనసాగుతున్న ఈడీ విచారణ
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టాలీవుడ్ను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్గా ఉన్న కెల్విన్ అప్రూవర్గా మారడంతో ఈడీ అధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ విచారణలో కెల్విన్ సంచలన విషయాలు బయట పడినట్లు సమాచారం. ఆరు నెలలు క్రితమే ఈకేసులో కెల్విన్ అండ్ గ్యాంగ్ను విచారణ చేశారు. ఈడీ అధికారుల ముందు సినీ ప్రముఖులతో తనకున్న పరిచయాలను ఈడీ ముందు కెల్విన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు అందజేసింది. ఈ కేసులో ముగ్గురు సినీ ప్రముఖలకు ఈడీ విచారించింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ను 10 గంటలు, నటి ఛార్మిని 8 గంటలు, రకుల్ప్రీతిసింగ్ను 6 గంటల పాటు ఈడీ విచారించింది. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నివేదిక, ఎన్సీబీ రిపోర్ట్ ఆధారంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఈడీ విచారిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ డ్రగ్స్ లింకులు బదిలీ అయిన నగదు లావాదేవీలపై ప్రశ్నిస్తోంది. సెప్టెంబర్ 2 తేదీన చార్మి, 4న రకుల్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ, 13న నవదీప్, 15న ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, నవదీప్ను విచారించనున్నారు. మిగతా నిందితులను సెప్టెంబర్ 22 వరకు ఈడీ అధికారులు విచారించనున్నారు.