టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు

tollywood drugs case

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. కెల్విన్ నుంచి కీలక సమాచారం రాబట్టిన అధికారులు

ఆర్.బి.ఎం, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో ఈడీ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ చుట్టూ తిరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్‌ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పూరి జగన్నాథ్‌, చార్మికౌర్‌, రకుల్‌ ప్రీత్‌ విచారణకు హాజరయ్యారు. మరికొంత మంది నిందితుల విచారణకు ఈడీ షెడ్యూల్ ప్రకటించారు. అయితే ఈ రోజు కెల్వీన్‌ను ఈడీ అధికారులు విచారణకు తీసుకువచ్చారు. నటుడు నందును కెల్విన్ సమక్షంలో విచారించారు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో వాహిద్ అనే మరో నిందితుడిని కూడా విచారించారు. ఈ కేసులో సెప్టెంబర్-08న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు.. కొనసాగుతున్న ఈడీ విచారణ.. ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Reply

Your email address will not be published.