యూట్యూబ్ ఛానల్స్పై సమంత పరువు నష్టం దావా
హైదరాబాద్: మూడు యూట్యూబ్ ఛానల్స్పై నటి సమంత పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. కూకట్పల్లి కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్పై పరువు నష్టం దావా వేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీతో పాటు లాయర్ వెంకట్రావుపై పిటిషన్ సమంత దాఖలు చేశారు. కాసేపట్లో సమంత తరుపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు. ఇటీవల సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. వారిద్దరిపై రకరకాల కథనాలు వివిధ యూట్యూబ్ ఛానల్స్లో ప్రసారమయ్యాయి.