చిన్నారిని బలిగొన్న రాజును పట్టిస్తే 50 వేలు ఇస్తా: ఆర్పీ పట్నాయక్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సైదాబాద్ లోని సింగరేణి కాలనీ ఘటనపై ఇప్పటికే సినీ,రాజకీయ ప్రముఖులు స్పందించారు. కాగా ఇదే ఘటనపై ఆర్పీ పట్నాయక్ స్పందించారు. నిందితుడిని పోలీసులకు పట్టించిన వారికీ 50 వేలు ఇస్తానని ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. ఆ మృగాడు దొరికితేనే చిన్నారి ఆత్మకు శాంతి అని అన్నారు. పోలీసుల నుండి తపించుకు తిరుగుతున్న నిందితుడు మీ దగ్గర్లోనే ఉండొచ్చని ప్రతి ఒక్కరు కన్నేసి ఉంచండి అంటూ అయన అన్నారు. నిందితుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు తప్పకుండ అతన్ని పట్టిస్తుందని ఆర్పీ పట్నాయక్ అన్నారు. రాష్ట్ర పోలీసు శాఖా నేరస్థుడిని పట్టుకునే పనిలో ఉన్నారని మనం అందరం కూడా వారికీ సహకరిద్దాం అంటూ ఆర్పీ పట్నాయక్ అన్నారు.