“మా” ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

“మా” ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
హైదరాబాద్‌: “మా” ఎన్నికలకు ఎన్నికల అధికారి వి. కృష్ణమోహన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అక్టోబర్‌ 10న ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ “మా” ఎన్నికలు నిర్వహిస్తారు. ఈనెల 27 నుంచి 29 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎన్నికలు జూబ్లీ హిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు సమాచారం. ఈసారి అధ్యక్ష పదవి కోసం విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు విష్ణు, సి.వి.ఎల్‌.నరసింహారావు పోటీ పడుతున్నప్పటికీ పోటీ ప్రధానంగా ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణుల మధ్య ఉండవచ్చని అంటున్నారు.

ఎనిమిది మంది ఆఫీస్‌ బేరర్స్‌, పద్దెనిమిది మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్స్‌ కోసం జరిగే ఈ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు ఈ నెల 27 నుండి 29 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 30న నామినేషన్లలను పరిశీలిస్తారు. వచ్చే నెల రెండో తేదీ వరకు నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్‌ 10న ఎన్నికలు, అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.

Leave a Reply

Your email address will not be published.