తెలంగాణాలో ఆ నియోజకవర్గం నుండే పోటీ చేయనున్న షర్మిల..

తెలంగాణాలో ఆ నియోజకవర్గం నుండే పోటీ చేయనున్న షర్మిల..

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వడివడిగా అడుగులు వేస్తున్న విషయం అందరికి తెలిసిందే. తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానంటూ అధికార పార్టీలపై విరుచుకుపడుతోంది షర్మిల. మరి కొద్దీ రోజుల్లోనే షర్మిల కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. అయితే షర్మిల తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారో అన్న అంశంపై అభిమానులకు క్లారటీ ఇచ్చారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కి పులివెందుల ఎలాగో తనకు కూడా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం అలా అని సెంటిమెంటుగా చెప్పారు షర్మిల. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేస్తునట్టు ఆమె వెల్లడించారు. ఖమ్మం జిల్లా నాయకులతో లోటస్‌పాండ్‌లో షర్మిల సమావేశం అయ్యారు. పార్టీ ఏర్పాటులో ఎలాంటి అడ్డంకులు వచ్చిన తమ ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు అన్నారు షర్మిల.

కరోనా నేపథ్యంలో షర్మిల పార్టీకి సంబంధించిన బహిరంగ సభకు అడ్డంకులు ఎదురైయే అవకాశాలు ఉన్నటు తెలుస్తుంది. ఏప్రిల్ 9 ఖమ్మంలో భారీ బహిరంగ నిర్వహించనున్నారు కరోనా విజృంభణ ఎక్కువకావడంతో ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎం చేయాలన్న దానిపై నాయకులు ఆలోచిస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *