నాతోనే బంగారు తెలంగాణ సాధ్యం: వైఎస్ షర్మిల

నాతోనే బంగారు తెలంగాణ సాధ్యం: వైఎస్ షర్మిల

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: యువకులు ఆలోచన చేయండి మీకు తోడపుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను నా తమ్ములు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే నేను చెలించిపోయి పోరాటం చేయాలనుకున్నఅని షర్మిల లోటస్ పాండ్ లో దీక్ష చేస్తూ వ్యాఖ్యానించారు. సునీల్ నాయక్ అనే తమ్ముడు చనిపోతే నా కళ్ళకు నీళ్లు వచ్చాయి అని షర్మిల అన్నారు. సునీల్ నాయక్ ఎలాగైన బ్రతకాలని తాను హాస్పిటల్ లో ప్రేయర్ చేశానని ఆమె తెలిపారు. విద్యార్థులు యువకులు ఇప్పడి నుండి మీరు ఎవరు కూడా ఆత్మ హత్యలు చేసుకోవొద్దు నేను మీ కోసం ఎంత వరకైనా వస్తా ఎన్ని పోరాటాలైన చేస్తా చివరకు ప్రాణాలు పోయేంతవరకు కూడా పోరాటం చేస్తా అని షర్మిల అన్నారు. బంగారు తెలంగాణ కేవలం నాతోనే సాధ్యమౌతుందని కచ్చితంగా సీఎం అయితానని ప్రతి ఒక్కరు తనతో చేయి కల్పి ముందుకు నడవాలని ఆమె అన్నారు. 7 ఏళ్ల పాలనలో కెసిఆర్ తెలంగాణకు చేసింది ఏమి లేదని ఆమె మరోసారి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *