ఏడుపాయ‌లలోని వ‌న దుర్గామాత‌ను దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

మెద‌క్ : ఏడుపాయ‌లలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ సునీతా ల‌క్ష్మారెడ్డి శనివారం పర్యటించారు. ఏడుపాయ‌ల వ‌న దుర్గామాత‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు, బంగారు బోనం స‌మ‌ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అమ్మ‌వారి స‌న్నిధిలో క‌విత‌, ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డి గాజులు తొడిగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. 100 మంది ఆడ‌ప‌డుచుల‌తో క‌లిసి అమ్మ‌వారికి బోనాలు స‌మ‌ర్పించామ‌ని తెలిపారు. ఏడు పాయల ఆల‌యానికి ప్ర‌త్యేక చ‌రిత్ర ఉంద‌న్నారు. మల్లన్న సాగర్ అభివృద్ధితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందింద‌న్నారు

Leave a Reply

Your email address will not be published.