మెగాస్టార్ చిరంజీవి గురువారం ప్రిన్స్ మహేష్ బాబున ఇంటికి వెళ్లి కలిశారు. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి బుధవారం కన్నుమూశారు. అయితే.. ఆమె అంత్యక్రియలకు చిరు హాజరకాలేకపోయారు. ఎందుకంటే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఈవెంట్ తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ఈ క్రమంలో నేడు కృష్ణ, మహేష్ ఇంటికి చిరంజీవి వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు. ఇందిరాదేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇందిరాదేవి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.