టీ–20 ప్రపంచకప్: రసవత్తరంగా మారిన సెమీస్ రేసు..

టీ–20 ప్రపంచకప్ రసవత్తరంగా మారింది. రోజులు దగ్గరపడిన కొద్దీ ఇంటస్ట్రీగా మారుతోంది. సూపర్ -12లో పోటాపోటీగా సెమీస్ రేసు సాగుతోంది. సూపర్ లీగ్ దశలో ఇంకో ఆరు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క జట్టు సెమీస్ చేరలేదు. గ్రూప్–1లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మూడు జట్లు 5 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. చివరి మ్యాచ్ లో ఈ మూడు జట్లు గెలిస్తే.. పాయింట్ల పట్టికలో రన్ రేట్ ఆధారంగా సెమీస్‎ చేరే అవకాశాలున్నాయి.

ఇక,. లాస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలవకూడదు. మరో మ్యాచ్ లో ఆప్గానిస్థాన్ ను ఆస్ట్రేలియా ఢి కొట్టనుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లంక కూడా సెమీస్ చేరే అవకాశం ఉంది. తన చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై ఆ జట్టు గెలవాలి. దీంతో పాటు ఆప్గానిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా లేదా ఐర్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాలి. ఇప్పటికే రేసు నుంచి ఐర్లాండ్, ఆప్గానిస్థాన్ తప్పుకున్నాయి.

ఇక గ్రూప్ -2 విషయానికి వస్తే.. టీమిండియా, పాక్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ఈ నాలుగు జట్లు రేసులో ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, రెండ్ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే డైరెక్టుగా సెమీస్ చేరుతాయి. భారత్ కు ఓడినా అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ లలో ఓ జట్టు ఓడాలి. ఒక వేళ భారత్ ఓడి.. సౌతాఫ్రికా, పాక్ గెలిస్తే.. దక్షిణాప్రికా సెమీస్ చేరుతోంది. దీంతో భారత్, పాక్ ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అయితే రన్ రేట్ ఆధారంగా ఓ జట్టు సెమిస్ చేరే అవకాశం ఉంది. రన్ రేట్ లో వెనుకబడ్డ బంగ్లా సెమీస్ చేరాలంటే పాకిస్థాన్ పై గెలివాలి. దక్షిణాఫ్రికా ఓడాలి. అప్పుడు కానీ భారత్ సెమీస్ అవకాశం ఉండదు..ఇదంతా తెలియాలంటే శని, ఆదివారంతో తెలిసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published.