రాజ్‌నాథ్‌సింగ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయాలా?: డా.మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

రాజ్‌నాథ్‌సింగ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయాలా?: డా.మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే

ఆర్.బి.ఎం వికారాబాద్: భారత రాజ్యాంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల పట్ల బీజేపీ, కాంగ్రెస్‌ రాద్ధాంతం చేస్తున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల్లోని నేపథ్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ముక్తుకు ఆనంద్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రల హక్కులను హరిస్తున్నదన్న ఆవేదనతోనే సీఎం కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని కోరారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్నదన్న అక్కసుతోనే కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు దొంగదీక్షలు చేస్తున్నారని మెతుకు ఆనంద్ మండిపడ్డారు. గతంలో రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్నే తొలగించాలని అన్నారు. ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలా? అని వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published.