పాడిపంటలతో ఆయురారోగ్యాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

పాడిపంటలతో ఆయురారోగ్యాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఆర్.బి.ఎం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ వారి స్వగ్రామం కేరెల్లి గ్రామంలో గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, ఊరడమ్మ, రుక్కమ్మ, గాలి పోచమ్మ, గ్రామ నాభిశిల మరియు నాగ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక సర్పంచ్ నర్సింహ రెడ్డి, ఎంపీపీ విజయ లక్ష్మి హన్మంత్ రెడ్డి, AMC చైర్మన్ సంతోష్ కుమార్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *