పూడూర్ మండల్ కంకల్ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విజయశాంతి..
ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ పరిధిలోని కంకల్ గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేపి నేతలు విజయశాంతి, ప్రహ్లాదరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ శివాజీ ధీరత్వాన్ని కొనియాడారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ జయంతి నేడు అని విజయశాంతి అన్నారు. ప్రతి హిందువు ఛత్రపతి శివాజిని ఆదర్శంగా తీసుకోవాలని విజయశాంతి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, యువత,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.