13 వేలకు గణేష్ లడ్డూను కైవసం చేసుకున్న మహమ్మద్ జాఫర్..
ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగే ఘనంగా నిర్వహించారు. అలంపల్లిలోని 14వ వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డూ వేలం కార్యక్రమం జరిగింది. వేలంపాటలో పెద్ద ఎత్తున అలంపల్లి నివాసులు పాల్గొన్నారు. చివరకు 13వేలకు మైనార్టీ యువకుడు మహమ్మద్ జాఫర్ లడ్డును కైవసం చేసుకున్నాడు. లడ్డు కైవసం చేసుకున్న మహమ్మద్ జాఫర్ మాట్లాడుతూ వేలంపాటలో పాల్గొని లడ్డును కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అలంపల్లిలో హిందూ,ముస్లింలు అన్నదమ్ముల్లా ఉంటామని ప్రతి పండగను అందరం కలిసి జరుపుకుంటామని మహమ్మద్ జాఫర్ తెలిపారు.