ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

ఆర్.బి.ఎం డెస్క్: తెలంగాణలో ప్రతి ఆషాడ మాసంలో వచ్చే బోనాల పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఘనంగా ఈ బోనాల పండుగను ప్రజలు నిర్వహిస్తుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా తకారబస్తీ లోని శ్రీ ముత్యాల అమ్మ దేవాలయంలో బుధవారం నాడు ఘనంగా జరిగాయి.ఈ బోనాల ఉత్సవాల్లో శాసన సభ ఉప సభాపతి టి.పద్మరావు గౌడ్ పాల్గొన్నారు.ఉపసభాపతి పద్మారావు గౌడ్ నూతనంగా అమ్మవారికి వెండి విగ్రహాన్ని తయారు చేయించి పూజ లో పాల్గొన్నారు. పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రజలను కరోనా మహమ్మారిని కాపాడాలని అమ్మవారిని కోరానని పద్మారావు గౌడ్ అన్నారు. బోనాల ఉత్సవాలు కోలాహలంగా పోతారాజుల నృత్యాలతో అందరినీ ఆకర్షిస్తూ సాగిన ఊరేగింపు ఉజ్జయిని మహంకాళి గుడి నుండి కూర్మబస్తీ వరక సాగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో యువ నాయకులు కిశోర్ గౌడ్, కిరణ్ గౌడ్, రమేశ్వర్ గౌడ్, త్రినేత్ర తదితరులుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.