తాండూరు ఎమ్మెల్యే తండ్రికి కోర్టులో ఊరట
ఆర్.బి.ఎం తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి తండ్రి విఠల్రెడ్డి, బాబాయ్ శ్రీశైల్రెడ్డికి కోర్టులో ఊరట లభించింది. 2018లో సాధారణ ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో విఠల్రెడ్డి, శ్రీశైల్రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులపై ఐపీసీ సెక్షన్-188 కింద బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేని కారణంగా వారిని నిర్దోషులుగా పేర్కొంటూ తాండూరు కోర్టు బుధవారం తీర్పునిచ్చిందని వారి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది గోపాల్ తెలిపారు. రోహిత్రెడ్డి రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు అడ్డంకులు సృష్టించి ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన వారిపై 13 తప్పుడు కేసులు పెట్టారని న్యాయవాది తెలిపారు.