వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన…
ఆర్.బి.ఎం: బండ్లగూడా జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మూసి నది అలుగు పారి వరద ముంపునకు గురైన సాయిబాబా నగర్, జ్ఞానేశ్వర్ కాలనీ,1 మరియు 5 వార్డుల్లో MLA ప్రకాష్ గౌడ్ ఈ రోజు పర్యటించారు.ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, ను ఆరా తీశారు,మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మిచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మేయర్ మహేందర్ గౌడ్,కార్పొరేటర్లు, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.