టీఆర్‌ఎస్‌కు పీకే, కాంగ్రెస్‌కు ఎస్కే!

టీఆర్‌ఎస్‌కు పీకే, కాంగ్రెస్‌కు ఎస్కే!

ఆర్.బి.ఎం హైదరాబాద్: వేసవికి ముందే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత మూడు రోజులుగా బీజేపీ నేత బండి సంజయ్ ఆధ్వర్యంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో దిశానిర్దేశం ఆ పార్టీ నేతలు తరుణ్ చుగ్, శివ ప్రకాష్ జీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణలో మరోసారి అధికారమే లక్ష్యగా ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంను సీఎం కేసీఆర్ రంగంలో దింపారు. అయితే కాంగ్రెస్ కూడా వ్యూహకర్తలను ఆశ్రయిస్తోంది. పీకే శిష్యుడు సునీల్ కనుగోలు (ఎస్కే)ను సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అయితే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల్లా కాకుండా వ్యూహకర్తలపై ఆధారపడకుండా కార్యకర్తలను కాషాయపార్టీ నమ్ముకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల వారీగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published.