ఘనంగా తెరాస జెండా పండుగ..

ఘనంగా తెరాస జెండా పండుగ..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పేదల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప సభాపతి తీగుల్ల పద్మా రావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లో తెరాస జెండా పండుగ గురువారం కోలాహలంగా జరిగింది. అన్ని డివిజన్లలో తెరాస జండాలను తెరాస కార్పొరేటర్లు స్థానిక నేతలు, కార్యకర్తల సమక్షంలో ఎగురవేశారు. సితఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ తెరాస పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం తెరాస ఆవిర్భావం నుంచీ తెరాసకు కంచు కోటగా నిలిచిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి కండి శైలజ, శ్రీమతి రాసురి సునిత, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ , తెరాస యువ నేతలు తీగుల్ల కిరణ్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *