అన్ని హంగులతో సెట్విన్ శిక్షణ కేంద్రం:తీగుల్ల పద్మారావు గౌడ్

అన్ని హంగులతో సెట్విన్ శిక్షణ కేంద్రం:తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్: అన్ని హంగులతో సెట్విన్ శిక్షణ కేంద్రం త్వరలోనే కార్యకలాపాలకు నోచుకోనుందని, ఈ కేంద్రం లో శిక్షణ పొందే వారికీ ఖచ్చితంగా ఉపాధి లభించేలా ఏర్పాట్లు జరుపుతామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లో కొత్తగా నెలకొల్పిన సెట్విన్ శిక్షణా కేంద్రం లో మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం పూజా కార్యక్రమం గురువారం జరిగింది.ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ కార్యక్రమంలో ముక్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యంత అధునాతన హంగులతో హంగులతో సెట్విన్ సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి రాసురి సునీత శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ , తెరాస యువ నేతలు తీగుల్ల కిరణ్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.