తెలంగాణ స్టేట్ సూఫీ ఇస్లామిక్ కార్యవర్గ సమావేశం..

తెలంగాణ స్టేట్ సూఫీ ఇస్లామిక్ కార్యవర్గ సమావేశం..

ఆర్.బి.ఎం: పెద్దపల్లి జిల్లా రామగిరి మండల్ బేగంపేట్ గ్రామం లో తెలంగాణ స్టేట్ సూఫీ ఇస్లామిక్ బోర్డు యూత్ ప్రెసిడెంట్ సిద్ద శంకర్ నివాసంలో తెలంగాణ స్టేట్ సూఫీ ఇస్లామిక్ బోర్డు కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి జిల్లా సభ్యుల తో కూడిన బృందాలు హాజరు కాగా,ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఫయాజుద్దీన్ వార్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం ముఖ్య ఉద్దెశం సూఫీ ఇస్లామిక్ బోర్డు అనేది అన్ని కులమతాలు కలుపుకుంటూ రక్త దానం ల్ ,షాదీ ముబారక్ ,అనాధలను చేరదీయడం చదువు చెప్పించడం లాంటి ఇంకా ఎన్నో మంచిపనులు చేయడం ఈ సూఫీ ఇస్లామిక్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దెశం అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రతి జిల్లాలలో,మండలంలో కమిటీలు వేయబోతున్నం అని తెలిపారు. ఇందులో భాగంగా ఈ కార్యవర్గ సమావేశానికి కరీంనగర్ నుండి 20 మంది సభ్యుల బృందం పాల్గొన్నారు. కాజా ఖిజెర్ , మేడిశెట్టి శ్రీనివాస్ని ఎంపిక చేసి 21 మంది తో కూడిన కరీంనగర్ జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published.