యాదాద్రిలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ ప్రత్యేక పూజలు!

హైదరాబాద్: సీఎం కేసీఆర్ శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నారు. ఆయన ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో యాదాద్రికి బయలుదేరనున్నారు. యాదగిరిగుట్ట ప్రధానాలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు గతంలో కేసీఆర్ కుటుంబం తరపున 1కిలో 16తులాల బంగారాన్ని ఇస్తానని ప్రకటించారు. అయితే ఈ రోజు బంగారాన్ని ఆలయ అధికారులకు ఇస్తారు. అనంతరం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటారు. అలాగే జాతీయ పార్టీ పెట్టేందుకు కేసీఆర్ సన్నాహాకాలు చేస్తున్నారు. పార్టీ ప్రకటించేందుకు ముహూర్తాన్ని కూడ నిర్ణయించారు. ఇందులోభాగంగా కొత్త పార్టీ పేరుపై యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరోవైపు జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఏర్పాట్లనూ టీఆర్‌ఎస్ నేతలు వేగవంత చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలపై దసరా పండుగనాడే పార్టీ అధినేత కేసీఆర్ సంతకాలు చేయనున్నారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పత్రాలను సమర్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *