సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలి…
ఆర్.బి.ఎం సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే ప్రారంభించిన పనులను వెంటనే పూర్తీ చేయాలని, తమ పర్యటనల్ల్లో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. శనివారం సీతాఫలమండీ క్యాంపు కార్యాలయంలో ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని త్వరలో సమీక్షిస్తామని పద్మారావు గౌడ్ తెలిపారు. అన్ని అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తున్నామని అయన తెలిపారు. తుకారంగేట్ రైల్వే వంతెన నిర్మాణ పనులు త్వరలో పూర్తీ కానున్నాయని, రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని పద్మారావు గౌడ్ ఆదేశించారు. తమ పర్యటనల సందర్భంగా ప్రజల అవసరాలను గమనించి తాము జారీ చేస్తున్న ఆదేశాలను అమలు జరపాలని స్పష్టం చేశారు.