బక్రీద్ ను ఆనందగా జరుపుకోవాలి : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

బక్రీద్ ను ఆనందగా జరుపుకోవాలి : డిప్యూటీ స్పీకర్  పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: జంట నగరాలు చిరకాలంగా అన్ని మతాల సహజీవనానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బక్రీద్ ను పురస్కరించుకొని జీ.హెచ్.ఏం.సి ఆధ్వర్యంలో చిలకలగూడా మైదానంలో మేకల విక్రయ కేంద్రం, పర్యావరణ కాలుష్య రహిత కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా తీగుళ్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ జంట నగరాల ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలను పవిత్రంగా జరుపుకుంటారని, వారికీ అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. పద్మారావు గౌడ్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, మైనారిటీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.