శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఉప సభాపతి పద్మారావు గౌడ్

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్: సికింద్రాబాద్ లోని సితాఫలమండీ త్రీ స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ వేడుకలను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉప సభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సితాఫలమండీ లో ప్రతీ ఏటా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మికతకు చింతనతో పాటు సంస్కృతిక వికాసానికి ప్రీతకగా నిలుస్తాయని పద్మారావు గౌడ్ అన్నారు..వినయం, నిజాయితీ, శ్రమ, ధర్మం, దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం వంటివి శ్రీకృష్ణుడు చెప్పిన విజయానికి ఐదు మంత్రాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో నేతలు దానం రవి, నిర్వాహకులు బొగ్గుల కృష్ణ, అశ్విన్, చెన్నయ్య గౌడ్, శేఖర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *