తెరాసను వీడే ప్రసక్తే లేదు..
తను తోలి నుంచి తెలంగాణా ఉద్యమంలో పాల్గొని తెరాస అదినేత కెసిఆర్ తో పాటు అయన కుటుంబంతో సన్నిహితంగా మేలిగానని పద్మారావు గౌడ్ వివరించారు. తాను తెరాస పార్టీని వీడతానని జరిగిన ప్రచారం తీవ్ర ఆవేదన, మనస్తాపాన్ని కలిగించిందని, ఎట్టి పరిస్తితుల్లో కెసిఆర్ కుటుంబానికి, తన అనుబంధం తెగదని పార్టీని వీడే ప్రసక్తే లేదని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. తెరాస పార్టీ లో తాను సంతృప్తికరంగా ఉన్నానని తనకు పార్టీని వీడే అవసరం లేదని అయన స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న వారిలో కార్పొరేటర్లు రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, నేతలు తీగుల్ల కిరణ్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, త్రినేత్ర గౌడ్, కంది నారాయణ, కరాటే రాజు, లింగాని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.