భయపెడితే భయపడం.. బట్టలువిప్పి రోడ్లమీద నిలబెడతాం: దాసోజు శ్రవణ్
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఇంద్రవెల్లి సభతో తెరాస ప్రభుత్వానికి చురుకు తగిలిందని మీడియాతో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. తెరాస పార్టీకి చెందిన నాయకులు కత్తులు, కటారులు పట్టుకుని నాలుకలు కోస్తాం అని హెచ్చరిస్తున్నారని తమకు కత్తులు దొరకవా అని శ్రవణ్ అన్నారు.మీరు నాలుకలు కొస్తే మేము కోయలేమా అని శ్రవణ్ అన్నారు.మంత్రులు ఎమ్మెల్యేలు మమల్ని భయపెడితే భయపడం మీ బట్టలు విప్పి రోడ్ల మీద నిలబెడతాం అని శ్రవణ్ హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీలు అడిగే వాటికీ వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత అధికార పార్టీది అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఒక్కపుడు తెల్ల రేషన్ కార్డుకు బియ్యం తెచ్చుకుని తినేవారికి ఇప్పుడు తెల్ల షర్ట్ లు వేసుకొని బెంజ్ కారులలో తిరగడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయన్ని దాసోజు శ్రవణ్ మీడియా ముకంగా ప్రశ్నించారు.