దత్తతు తీసుకున్న గ్రామంలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసున్న సీఎం కెసిఆర్..
ఆర్.బి.ఎం డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తాను దత్తతు తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో అయన ఈరోజు పర్యటించారు. ఆ గ్రామానికి కెసిఆర్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకున్నారు. గ్రామంలోని దళితవాడలో సీఎం కెసిఆర్ అధికారులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లారు. దళితవాడలో ఉన్న ప్రజల స్థితిగతుల గురుంచి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వారి సమస్యలను కెసిఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ దళితవాడలో ఉన్న ఇండ్లను పరిశీలించిన అనంతరం గ్రామం మొత్తం పర్యటిస్తూ పారిశుద్ధ్య చర్యలను తెలుసుకున్నారు.