జీవన్ రెడ్డి కెసిఆర్ కు లేఖ..
ఆర్.బి.ఎం డెస్క్: జగిత్యాల జిల్లలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది దాని కట్టడి చేసేందుకు చర్యలు ముమ్మరం చేయాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు లేఖ రాశారు. జిల్లాలో కరోనా కేసులు రోజుకు అధిక సంఖ్యలో నమోదౌతున్న నేపథ్యంలో కరోనా బారిన పడిన వారికీ ప్రభుత్వ స్కూల్ లలో మోడల్ స్కూల్స్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఊరటను కలిగించాలని అయన కోరారు. జిల్లా వ్యాప్తంగా వైరస్ ప్రభావం ఎక్కువ ఉన్నందున టెస్ట్ కిట్స్ అందుబాటులో ఉంచాలని జీవన్ రెడ్డి కెసిఆర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.