ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు: కేసీఆర్

cm kcr on drugs

ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు: కేసీఆర్

ఆర్.బి.ఎం  హైదరాబాద్: డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫార్సులను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ విషయంలో వెయ్యి మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని నియమించుకుని ఇంటెలిజెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని డీజీపీని కేసీఆర్ ఆదేశించారు. పోలీసు శాఖకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో నార్కోటిక్ డ్రగ్స్ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి సమూలంగా నిర్మూలించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *