ఓయూ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్…

ఓయూ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్…

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియ యూనివర్సిటీ లో సీఎం కేసీఆర్ క్రికెట్ కప్‌ టోర్నీ ప్రారంభోత్సవం లో ప్రభుత్వ విప్ అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తో కలిసి శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు.

ఈ టోర్నమెంట్‌ ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడం కోసం.. ఓయూ వేదికగా పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఓయూ స్టూడెంట్ గా ఇక్కడ చేసిన ఉద్యమాలను శుభప్రద్ నెమరవేసుకున్నారు. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ పిలుపుతో ఓయూ వేదికగా అనేక ఉద్యమాలు చేసినట్లు శుభప్రద్ గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని శుభప్రద్ పటేల్ తెలిపారు.

బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కతుందన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ లు బాలరాజు యాదవ్, జగన్మోహన్ రావ్,గజ్జెల నగేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పిడమర్తి రవి,శ్యామేల్ , టోర్నమెంట్ నిర్వాహకులు
టీఆరేస్వీ రాష్ట్ర నాయకులు తుంగబాలు , జంగయ్య,కృష్ణ, నవీన్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.