కేసీఆర్ ఫోన్.. ఫాం హౌస్కు పరుగులు పెట్టిన మంత్రులు
ఆర్.బి.ఎం హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఉన్నఫలంగా మంత్రులను ఎర్రవెళ్లి ఫాం హౌస్కు రావాలని అందులోబాటులో ఉన్న మంత్రులకు కబురు పెట్టారు. కేసీఆర్ ఆదేశంతో మంత్రులు హూటాహుటిన మంత్రులు ఫాం హౌస్కు వెళ్లారు. ఫాం హౌస్కు వెళ్లిన వారిలో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, జగదీష్రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నారు. వీరితో పాటుగా ఎమ్మెల్సీ కవిత, సీఎస్ సోమేష్కుమార్తో పాటు ఉన్నతాధికారులను సమావేశానికి రావాలని ప్రగతిభవన్ నుంచి ఫోన్లు వెళ్లాయి. కేసీఆర్ దాదాపుగా మంత్రులతో సమావేశమైనట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రశాంత్కిషోర్తో పాటు నటుడు ప్రకాష్రాజ్ వివిధ ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం ప్రశాంత్కిషోర్, కేసీఆర్ను కలిశారు. ఇప్పటివకే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలుపై పీకే టీం ఓ రిపోర్టును కూడా రూపొందించింది. వీటన్నింటిపై పీకే, కేసీఆర్కు వివరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీకే టీం రాష్ట్రానికి రావడం.. కేసీఆర్తో మంత్రులు అత్యవసరంగా భేటీ కావడంతో ప్రధాన్యత సంతరించింది.