కందిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

  • కందిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

ఆర్.బి.ఎం కంది: ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడికి సంబంధించినవివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంది గ్రామ శివారులో ఐటి లేక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శవం కనిపించడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పరిశీలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు క్లూస్ టీం, శునకలతో ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి గా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.