పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆశీస్సులు తీసుకున్న ఏనుగుల సందీప్ రెడ్డి

పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆశీస్సులు తీసుకున్న ఏనుగుల సందీప్ రెడ్డి

ఆర్.బి.ఎం, రాజేంద్రనగర్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ సందీప్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. కాగా ఏనుగుల సందీప్ రెడ్డి తను దైవంలా భావించే వైఎస్సార్ కుటుంబ సభ్యుల ఆశీస్సులు తీసుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి లను కలసి ఏనుగుల సందీప్ రెడ్డి జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏనుగుల సందీప్ రెడ్డి ఆర్.బి.ఎం మీడియాతో మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటానని తెలియజేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి పదవులు కట్టబెట్టిన ఘనత కేవలం వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందని ఏనుగుల సందీప్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడం కోసం అలుపెరుగని శ్రమ చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అక్కకు మద్దతుగా నిలిచి షర్మిల అక్క బాటలో నడుస్తానని ఏనుగుల సందీప్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలంగాణలో కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజలకు బాసటగా నిలిచే సంక్షేమ పథకాలు అమలు అయ్యే విధంగా తమ అధినేత్రితో మాట్లాడి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుగుల సందీప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.