రేవంత్ రెడ్డి కి కరోనా..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: యావత్ ప్రాంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మానవాళిని ఎంతో భయానికి గురిచేసింది. చిన్న, పెద్ద, ముసలి, పేదవాడు, ఉన్నవాడు, సినీ, రాజకీయ ప్రముఖులు అని తేడా లేడకుండా ప్రతి ఒక్కర్ని కరోనా పలకరించి పోయింది. దీని దాటికి ఎంతో మంది బలయ్యారు. కరోనా వ్యాప్తి తగింది అనుకుంటు ఇప్పుడు ఇప్పుడే ప్రజలు గాలి పీల్చుకుంటున్న సందర్భంలో మళ్ళి కరోనా మహమ్మారి తన పంజాను మనవాళిపై విసురుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సైతం కరోనా బారినపడ్డారు. రేవంత్ రెడ్డి కి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దింతో రేవంత్ రెడ్డి వైద్యుల సూచనల మేరకు తాను ఐసోలేషన్లో ఉన్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇప్పటివరకు తనను కలిసిన వాళ్ళు కరోనా టెస్టులు చేయించుకోవాలి అని అయన సూచించారు