అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా..

అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా..

ఆర్.బి.ఎం: బ్రేకులు ఫేయిల్ అవ్వడంతో ఆర్టీసీ బస్సు బొల్తా కొట్టిన ఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్ర సమీపంలోని అనంతగిరి కొండల వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వికారాబాద్‌ నుంచి ధారూర్‌లో జరిగే క్రిస్టియన్ మెథడిస్ట్ జాతరకు 72 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అనంతగిరి కొండల్లోని ఘాట్ రోడ్డు వద్దకు రాగానే బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపుతప్పి బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒ మహిళ మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసీ బస్సు బొల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్ సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ప్రమాదం గురించి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని వైద్యులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published.