ఆరో రౌండ్‌లో ఆధిక్యంలో టీఆర్‌ఎస్

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు రసవత్తరంగా ఉన్నాయి. ఓటర్లు ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. బోటాబోటి మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ఫలితాలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది. వేల రూపాయలు తీసుకున్న ఓటర్లు సమాన దృష్టితో ఓట్లు వేశారు. అందుకే టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పెద్ద మెజార్టీ కాలేదు. ఆరవ రౌండ్‎లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 1, 4, 5 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. 2, 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది.

మునుగోడు ఉప ఎన్నికలో గందరగోళం నెలకొందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యాలయం కన్నుసన్నల్లో కౌంటింగ్ జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగని మునుగోడు ప్రజలకు ఆయన హ్యాట్సాప్ చెప్పారు. మునుగోడులో అంతిమ విజయం బీజేపీదేనని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *