కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు: ఎమ్మెల్యే ఈటల

హైదరాబాద్: సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రులు పనిచేసిన స్థానాల్లో టీఆర్‌ఎస్ ఓడిపోయిందన్నారు. సర్వే సంస్థలకు అందని విధంగా తీర్పు రాబోతుందని జోస్యం చెప్పారు. మునుగోడులో బీజేపీ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముమ్మటికీ ఓడిపోయేది కేసీఆర్ అహంకారమేనని హెచ్చరించారు. వందల కోట్లు ఖర్చు పెట్టకుండా కేసీఆర్ ఏ ఉప ఎన్నికకూ వెళ్లలేదని మండిపడ్డారు. పదవులు కాపాడుకోవడానికి మద్యం, డబ్బు పంచారని ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారని, ఓటర్లకు రాజగోపాల్‌రెడ్డి బంగారం పంచుతారని ఆరోపించడం ధర్మమా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published.