INDIA PRESIDENT రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశృతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తున్న నేపథ్యంలో పోలీసులకు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాలికి పోలీసులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలైనట్లు తెలుస్తుంది. కాగా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన భారత రాష్ట్రపతి ముర్ము ఈరోజు (డిసెంబర్ 20) భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు.