అనుమానాస్పద స్థితిలో క్యాసారంలో వ్యక్తి మృతి..

ఆర్.బి.ఎం: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన భానుర్ పోలీస్ స్టేషన్ పరిధి క్యాసారం గ్రామంలో వెలుగుచూసింది. క్యాసారం గ్రామానికి చెందిన ఎం.సత్యనారాయణ గ్రామ శివారులో మద్యం సేవిస్తూ అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు భానుర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిది అత్య లేక సహజ మరణమే అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.